అమెరికా-ఇరాన్ (US-Iran)మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ ఇరాన్ సైనిక కమాండర్ (Iranian Military Commander) అమీర్ హతామీ (Amir Hatami) సంచలన ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని(US Soldier) పట్టుకున్నా(Capture) లేదా చంపినా (Kill) ఇరానీయులకు (Iranians) 30,000 అమెరికన్ డాలర్ల (30,000 US Dollars) బహుమతి (Reward) అందిస్తామని ఆయన ప్రకటించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇరాన్కు చెందిన తస్నిమ్ వార్తా సంస్థ (Tasnim News Agency)ప్రకారం, ఆగస్టు 16న టెహ్రాన్లో(Tehran) ప్రసంగించిన అమీర్ హతామీ ఈ ప్రకటన చేశారు. అమెరికా సైనికుడిని పట్టుకోవడం లేదా చంపడం జరిగితే ఇరాన్ ప్రజల తరఫున సుమారు 30,000 డాలర్ల బహుమతి అందిస్తామని పేర్కొన్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఈ మొత్తం సుమారు 5 బిలియన్ ఇరానియన్ టోమన్లకు సమానమని హతామీ వెల్లడించినట్లు సమాచారం.
శాంతి చర్చలు నిలిచిన సమయంలో ప్రకటన
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చల్లో(Peace Talks) స్పష్టమైన పురోగతి కనిపించని సమయంలో ఇరాన్ కమాండర్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా చమురు ట్యాంకర్ల రాకపోకలపై కూడా తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఇరాన్, అమెరికా మధ్య ఘర్షణలకు తక్షణ ముగింపు లేదా కాల్పుల విరమణకు సంబంధించిన స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదని నివేదికలు పేర్కొంటున్నాయి.
అరేబియా సముద్రంలో అమెరికా విమాన వాహక నౌక
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా సెంట్రల్ కమాండ్ అధిపతి అడ్మిరల్ బ్రాడ్ కూపర్ (Admiral Brad Cooper) అరేబియా సముద్రంలో మోహరించిన యూఎస్ఎస్ లింకన్ విమాన వాహక నౌకను సందర్శించారు. తన 10 రోజుల ప్రాంతీయ పర్యటనలో భాగంగా ఆయన ఈ నౌకను సందర్శించినట్లు సమాచారం. ఇరాన్కు సంబంధించిన అమెరికా సైనిక చర్యల్లో యూఎస్ఎస్ లింకన్ (USS Lincoln) కీలక పాత్ర పోషిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
240 రోజులకు పైగా సముద్రంలో యూఎస్ఎస్ లింకన్
యూఎస్ఎస్ లింకన్ (USS Lincoln) జనవరిలో మధ్యప్రాచ్య ప్రాంతానికి చేరుకుంది. ఈ విమాన వాహక నౌక 240 రోజులకు పైగా నిరంతరాయంగా సముద్రంలో ఉండటం ద్వారా రికార్డు సృష్టించినట్లు సమాచారం. సుమారు 5,000 మంది నావికులు, మెరైన్లకు వసతి కల్పించే సామర్థ్యం ఈ నౌకకు ఉంది. అయితే దీర్ఘకాలిక మోహరింపు కారణంగా సిబ్బందికి మానసిక ఆరోగ్యం, సరఫరాలకు సంబంధించిన సమస్యలు ఎదురైనట్లు కూడా కొన్ని నివేదికలు వెల్లడించాయి.
దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులు
ఇదిలా ఉండగా, దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ (Israel) జరిపిన రెండు దాడుల్లో కనీసం 11 మంది మరణించినట్లు సమాచారం. హిజ్బుల్లా సీనియర్ కమాండర్లు అబు హసన్ అలా, అలీ సమీర్ అల్-హజ్ హసన్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్- హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన అత్యంత తీవ్ర దాడుల్లో ఇవి కూడా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
గాజా కాల్పుల విరమణపై చర్చలు
మరోవైపు గాజాలో కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. హమాస్ ప్రతినిధి బృందం ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మధ్యప్రాచ్యంలో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఘర్షణలు, గాజా కాల్పుల విరమణ చర్చలు ఒకేసారి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి.







