ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా..

ఎనిమిదేళ్ల తర్వాత వెండితెరపైకి ప్రీతి జింటా..

Summarize with AI

బాలీవుడ్ అందాల తార ప్రీతి జింటా (Preity Zinta) దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మరోసారి వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. ఒకప్పుడు వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన ప్రీతి, 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్‌ను (Gene Goodenough) వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై కుటుంబ జీవితానికే ప్రాధాన్యం ఇచ్చింది. అనంతరం 2021లో సరోగసీ (Surrogacy) ద్వారా కవల పిల్లలకు తల్లిగా మారిన ఆమె, తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించింది. ఇప్పుడు ఆగస్టు 14న విడుదల కానున్న ‘బత్వారా 1947’(Batwara 1947) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రీతి, తనకు నటనపై ఎంత ప్రేమ ఉన్నా కుటుంబం కంటే పెద్దది ఏదీ లేదని స్పష్టం చేసింది. పిల్లలతో గడిపిన ఈ ఎనిమిదేళ్ల ప్రయాణం తన జీవితంలో అత్యంత విలువైనదని, తల్లిగా పొందిన ఆనందానికి ఏ విజయమూ సాటిరాదని ఆమె చెప్పింది.

తాజా ఇంటర్వ్యూలో ప్రీతి జింటా తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎంత పెద్ద సినిమా అవకాశం వచ్చినా భర్త, పిల్లలే తన తొలి ప్రాధాన్యమని చెప్పిన ఆమె, ప్రస్తుతం వెబ్ సిరీస్‌లకు దూరంగా ఉండడానికి కూడా అదే కారణమని వెల్లడించింది. ఓటీటీ ప్రాజెక్టులకు నెలల తరబడి సమయం కేటాయించాల్సి వస్తుందని, ఆ సమయంలో పిల్లలకు దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని తెలిపింది. మరోవైపు షూటింగ్‌ల కోసం భారత్‌లో ఉండాల్సి వచ్చినా కుటుంబ బాధ్యతలను తన భర్త జీన్ గూడెనఫ్ (Gene Goodenough) ఎంతో ప్రేమగా చూసుకుంటారని, అలాంటి జీవిత భాగస్వామి దొరకడం తన అదృష్టమని పేర్కొంది. తమ కవల పిల్లలు సగం భారతీయులు, సగం అమెరికన్లు అయినప్పటికీ భారతీయ సంస్కృతి, విలువలతోనే పెంచుతున్నానని వెల్లడించిన ప్రీతి, స్టార్‌డమ్ కంటే కుటుంబ బంధాలకే జీవితంలో అత్యధిక విలువ ఇస్తానని మరోసారి స్పష్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment