బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. టీఎంసీలో తిరుగుబాటు

బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. టీఎంసీలో తిరుగుబాటు మంటలు!

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి (TMC Party) చెందిన ఎమ్మెల్యే రీటాబ్రతా బెనర్జీని (Ritabrata Banerjee) పార్టీ సస్పెండ్ చేసిన నేపథ్యంలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. అయితే ఈ చర్యను సవాల్ చేసిన రీటాబ్రతా, తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

ఇటీవల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) నిర్వహించిన కీలక సమావేశానికి పలువురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం కూడా పార్టీ అంతర్గత సంక్షోభానికి సంకేతంగా భావిస్తున్నారు. ఇక అసెంబ్లీలోకి బహిష్కృత ఎమ్మెల్యేగా రీటాబ్రతా బెనర్జీ ప్రవేశించడం మరింత చర్చనీయాంశమైంది. టీఎంసీలో భారీ చీలిక ఏర్పడిందనే ప్రచారం జోరందుకోగా, తిరుగుబాటు వర్గానికి రీటాబ్రతా నేతృత్వం వహించే అవకాశాలపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆయనకు మద్దతు ప్రకటించారని, కొత్త రాజకీయ సమీకరణాలకు ఇది దారితీయొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తిరుగుబాటు ఎమ్మెల్యేల అసలు సంఖ్య ఎంత అనే అంశంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment