రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్బస్టర్ విజయంతో ప్రేక్షకుల్లో సీక్వెల్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ రెండో భాగం ఇప్పుడు మరింత గ్రాండ్గా రూపుదిద్దుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ‘కల్కి 2’ కోసం హైదరాబాద్లో ఓ భారీ సెట్ను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సెట్లో చిత్రానికి హైలైట్గా నిలిచే ఇంటర్వెల్ బ్లాక్ను షూట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సన్నివేశంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్ (అశ్వత్థామ పాత్రలో), కమల్ హాసన్ (సుప్రీమ్ యాస్కిన్గా) కలిసి కనిపించబోతుండటం సినీ ప్రియుల్లో భారీ ఎక్సైట్మెంట్ను రేకెత్తిస్తోంది. ముగ్గురు దిగ్గజ నటులు ఒకే ఫ్రేమ్లో కనిపించే ఈ సీన్ థియేటర్లలో గూస్బంప్స్ కలిగించనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక ఈ సీక్వెల్కు సంబంధించిన మరో ఆసక్తికర అంశం టైటిల్. ‘కర్ణ 3102 బీసీ’ అనే పేరును మేకర్స్ పరిశీలిస్తున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి భాగం కల్కి అవతారాన్ని పరిచయం చేస్తే, రెండో భాగం కర్ణుడి పునరాగమనం, ద్వాపర యుగంలోని కీలక ఘట్టాలపై దృష్టి సారించనుంది. కథ మొత్తం కర్ణుడి పాత్ర చుట్టూనే తిరుగుతుందని, మైథాలజీ ఎలిమెంట్స్ మరింత విస్తృతంగా ఉండబోతున్నాయని సమాచారం. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ ఎలాంటి రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తుండగా, ‘కల్కి 2’ భారతీయ సినీ చరిత్రలో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.








