ఏపీ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు మరొక అవకాశాన్ని అందించింది. మార్చి 2025 SSC పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లించని వారికి తత్కాల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈనెల 27 నుండి జనవరి 10 వరకు విద్యార్థులు ఫీజు చెల్లించుకోవచ్చు.
తత్కాల్ విధానంలో రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ అవకాశం వినియోగించుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కె. శ్రీనివాసులురెడ్డి విద్యార్థులకు సూచించారు. ఇంకా ఫీజులు చెల్లించని వారికి ఈ తత్కాల్ విధానం ఒక విలువైన అవకాశం.







