తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది. జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీ వద్ద నిపుణుల అభిప్రాయం ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఆధారాలు ఉంటే విచారణ సంస్థకు ఇవ్వాలని సూచన
లడ్డూ వ్యవహారంపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ సంస్థగా కేంద్ర దర్యాప్తు సంస్థ పరిశీలన కొనసాగిస్తున్న నేపథ్యంలో, పిటిషనర్ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని నేరుగా విచారణ సంస్థకు అందించాలని సూచించింది.
ఆరోపణలు చేయడం కంటే వాటిని నిరూపించే స్పష్టమైన ఆధారాలు ఉండాలని న్యాయస్థానం పేర్కొంది. తిరుమల లడ్డూ వంటి భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా సూచించింది.
జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా..? సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు








