ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం.. పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ రూ.321

ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధ ప్రభావం.. పాకిస్తాన్‌లో లీటరు పెట్రోల్ రూ.321

ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్న పాకిస్తాన్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో అక్కడ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. దీంతో పెట్రోల్ ధరలు ఒక్కసారిగా పెరిగి సాధారణ ప్రజల జీవన వ్యయం మరింత భారంగా మారింది.

ప్రస్తుతం పాకిస్తాన్‌లో పెట్రోల్ ధర లీటరుకు రూ.321.17కి చేరింది. గతంలో రూ.266.17గా ఉన్న ధరను ప్రభుత్వం రూ.55 పెంచింది. హై-స్పీడ్ డీజిల్ ధర కూడా లీటరుకు రూ.335.86గా నమోదైంది. LPG ధరలు కూడా భారీగా పెరిగి 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ.1,046కు చేరుకుంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా వచ్చే చమురు సరఫరా అంతరాయం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ వంటి నగరాల్లో పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కనిపిస్తున్నాయి.

ఇంధన ధరల పెరుగుదల ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడింది. దేశీయ విమాన టిక్కెట్లు సుమారు PKR 2,800 వరకు పెరిగాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు రోజుల పని విధానం అమలు చేయడం, కొంతమందిని ఇంటి నుంచే పని చేయించడం వంటి చర్యలు చేపట్టింది. ప్రస్తుతం దేశంలో సుమారు 28 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నప్పటికీ యుద్ధ పరిస్థితులు కొనసాగితే ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment