చంద్రబాబు ఉప ప్రధాని అయితే దేశం భరిస్తుందా? జగన్ సెటైర్లు (Video)

చంద్రబాబు ఉప ప్రధాని అయితే దేశం భరిస్తుందా? జగన్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) త్వరలో దేశానికి ఉప ప్రధాని (Deputy Prime Minister) కాబోతున్నారంటూ టీడీపీ అనుకూల మీడియాల్లో వస్తున్న వార్తలపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తనదైన శైలిలో స్పందించారు. బుధవారం తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో (Press Meet) ఆయన ఈ అంశంపై ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేశారు.

ఆయనను భరించడం దేశ ప్రజల వల్ల కాదు!
మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జగన్ నవ్వుతూ బదులిచ్చారు. “చంద్రబాబును ముఖ్యమంత్రిగానే మనం భరించలేకపోతున్నాం. అలాంటిది ఆయన ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు (People of the Country) ఎలా భరిస్తారు?” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసిన వ్యక్తి, దేశ స్థాయికి వెళ్తే పరిస్థితి ఏంటన్నట్లుగా జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటాలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు పొంతన ఉండదని ఆయన పునరుద్ఘాటించారు.

ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు రిప్లై..
అసెంబ్లీలో వైసీపీ బలం కేవలం 11 మందే ఉన్నప్పటికీ, వారు 1100 మందిలా మాట్లాడుతున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ స్పందించారు. మా పార్టీ ప్రతినిధులు అంత నిబద్ధతతో, ధైర్యంగా ఉన్నారని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఒప్పుకోవడం సంతోషం. సంఖ్యాబలం కంటే ప్రజా సమస్యల మీద గళం ఎత్తే గొంతుకలే ముఖ్యమని జగన్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాన్ని జగన్ సమర్థిస్తూ, పవన్ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా మలుచుకున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జగన్ చేసిన విమర్శల తర్వాత ఈ పొలిటికల్ సెటైర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment