చంద్ర‌బాబు కేసులో బిగ్ ట్విస్ట్‌.. ఎంట్రీ ఇవ్వ‌నున్న సీబీఐ!

చంద్ర‌బాబు కేసులో బిగ్ ట్విస్ట్‌.. ఎంట్రీ ఇవ్వ‌నున్న సీబీఐ!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో సంచలనంగా మారిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ (Inner Ring Road Scam) కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ సక్రమంగా సాగడం లేదని ఆరోపిస్తూ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును తక్షణమే కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ప‌నిచేస్తున్న ద‌ర్యాప్తు సంస్థ‌ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)(CBI)కి బదిలీ చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

పిటిషనర్ తరఫున ప్రముఖ న్యాయవాది జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్‌ (Jada Sravan Kumar) హైకోర్టులో వాదనలు వినిపించనున్నారు. ఒక నిందితుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన ఏపీ సీఐడీ స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విచారణ కొనసాగించలేదని పిటిషన్‌లో ఆరోపించారు.

  • పిటిషనర్ ఆరోపణలు ఏమిటి?
  • ఈ కేసులో ఇప్పటికే 486 పేజీల ఆధారాలు సేకరించిన ఏపీ సీఐడీ, ఇప్పుడు ఆధారాలు లేవని చెబుతూ కేసును మూసివేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
  • 2024లో సుమారు 500 పేజీల ఆధారాలను హైకోర్టులో దాఖలు చేసిన దర్యాప్తు సంస్థ, ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.
  • 2021లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారులపై ముఖ్యమంత్రి రివ్యూ అథారిటీగా ఉండటం వల్ల విచారణ ప్రభావితం అవుతుందని వాదించారు.
  • నిందితుడిగా ఉన్న వ్యక్తి కింద పని చేసే అధికారులతో విచారణ కొనసాగించడం నైతికంగా తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
  • ఈ నేపథ్యంలో కేసును సీబీఐకి బదిలీ చేయకపోతే తనకు న్యాయం జరగదని రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.

హైకోర్టు విచారణ
ఈ పిటిషన్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు సోమవారం లేదా మంగళవారం వాదనలు వినే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేసు సీబీఐకి బదిలీ అవుతుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment