నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను కర్నూలులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమికి చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించారు.
ఆరోగ్యంపై ఇంకా క్లారిటీ లేదు
కోట్ల ప్రకాష్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఎమ్మెల్యే ఆస్పత్రిలో చేరారన్న వార్త నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దీంతో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.