రేవంత్ సర్కార్ పై కేటీఆర్‌ ప్రధాన ఆరోపణలు

రేవంత్ సర్కార్ పై కేటీఆర్‌ ప్రధాన ఆరోపణలు

మెట్రో ప్రాజెక్టుపై బెదిరింపులు: ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్‌రెడ్డి  (Revanth Reddy) బెదిరింపులు, ముడుపుల వేధింపుల కారణంగా హైదరాబాద్‌ (Hyderabad) మెట్రో రైల్‌ (Metro Rail) ప్రాజెక్టు Project) నుంచి ఎల్‌ అండ్‌ టీ సంస్థ వైదొలుగుతోందని కేటీఆర్‌ అన్నారు. గతంలో ఆ సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించారని ఆరోపించారు.

ఎమ్మార్‌, ఇతర కంపెనీల సెటిల్‌మెంట్లు: గతంలో వివాదాస్పదమైన ఎమ్మార్‌ సంస్థ (EMAAR Company) ఆస్తులను కూడా కమిషన్ల కోసం అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాగే ఇతర కంపెనీల కేసులను అడ్డుపెట్టుకుని సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నారని విమర్శించారు.

రీజినల్‌ రింగు రోడ్డు అలైన్‌మెంట్‌ మార్పు: జైపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్‌రెడ్డి భూముల కోసమే ఆర్‌ఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ను మార్చారని, దీనివల్ల వేలాది మంది రైతులు భూములు కోల్పోతున్నారని ఆరోపించారు. ఈ రోడ్డు వెంబడి ఇప్పటికే రేవంత్‌ కుటుంబం భూముల కొనుగోలుకు ఒప్పందాలు చేసుకుందని చెప్పారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల అమ్మకం: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలను రేవంత్‌రెడ్డి బీజేపీకి ‘గొర్రెల్లా అమ్మేశారని’ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీ మనిషే అని ఆయన స్పష్టం చేశారు.

గ్రూప్‌ 1 అక్రమాలు, నిరంకుశత్వం: గ్రూప్‌ 1 ఉద్యోగాలను రూ.3 కోట్లకు అమ్ముకున్నారని అభ్యర్థులే చెబుతున్నారని, దీనిపై బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. విద్యార్థులు, అభ్యర్థులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం కూడా నిర్వహించుకోలేని నిరంకుశ పాలన రాష్ట్రంలో సాగుతోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై విమర్శలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ కలిసి చిల్లర రాజకీయం చేస్తున్నాయని కేటీఆర్‌ మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నేత ఏనుగు రాకేశ్‌రెడ్డి రూపొందించిన కాళేశ్వరం డాక్యుమెంటరీని విడుదల చేశారు. ప్రాజెక్టు కూలిపోతే హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపు ఎలా సాధ్యమని అసెంబ్లీలో ప్రశ్నిస్తే ప్రభుత్వానికి సమాధానం లేదని ఎద్దేవా చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment