విశాఖలో దారుణం.. ఉద్యోగి భార్యపై అత్యాచారయత్నం

విశాఖలో దారుణం.. ఉద్యోగి భార్యపై అత్యాచారయత్నం

విశాఖపట్నం (Visakhapatnam) నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగి (Government Employee) ఇంట్లోకి చొరబడి, అతని భార్యపై దుండగులు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఈ సంఘ‌ట‌న స్థానికుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసింది. భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలిని బలవంతపెట్టి, ఆ దారుణానికి పాల్పడటమే కాకుండా దుండగులు వీడియోలు కూడా చిత్రీకరించినట్లు సమాచారం.

ఈ సంఘటనపై షాక్‌కి గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత భర్త, భార్యతో కలిసి విశాఖ సీపీ శంఖ బ్రత బాగ్చి వద్దకు వెళ్లి అధికారికంగా ఫిర్యాదు చేశారు. వెంటనే సీపీ ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

భీమిలి (Bheemili) పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకోవడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శోధన కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన విశాఖలో కలకలం రేపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment