అన్నమయ్య జిల్లాలో (Annamayya District) అధికార తెలుగుదేశం పార్టీకి (Telugu Desam Party – TDP) భారీ ఎదురుదెబ్బ తగలింది. టీడీపీ (TDP) సీనియర్ నేత (Senior Leader), 2024 ఎన్నికల్లో రాజంపేట నియోజకవర్గం (Rajampet Constituency) నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సుగవాసి సుబ్రమణ్యం (Sugavasi Subramanyam) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) లేఖ రాశారు.
సుగవాసి సుబ్రమణ్యం తన రాజీనామా (Resignation) నిర్ణయం గురించి మాట్లాడుతూ, “ప్రజల అభిప్రాయాలను, నా అనుచరులు, నా వెంట నడిచే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఈ నిర్ణయం ఈ రోజుతో తీసుకున్నది కాదు. గత ఐదారు నెలలుగా ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను” అని తెలిపారు.
“భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లో కొనసాగుతాను. ప్రజలకు తోడ్పాటు అందించేందుకు కృషి చేస్తాను” అని మీడియాకు వివరించారు. తన తండ్రి పాలకొండ్రాయుడు (Palakondrayudu) జీవించి ఉన్నప్పుడే ఈ రాజీనామా విషయంపై చర్చించినట్లు, ఆయన అనుమతి ఉన్నట్లే భావిస్తున్నానని సుబ్రమణ్యం వెల్లడించారు. “ఇకపై తెలుగుదేశం పార్టీతో నాకు ఎలాంటి సంబంధం ఉండదు. త్వరలో మీడియా సమావేశంలో అన్ని విషయాలను వివరంగా తెలియజేస్తాను” అని సుగవాసి సుబ్రమణ్యం సంచలన ప్రకటన చేశారు.
సీనియర్ నేత రాజీనామాతో రాజంపేటలో టీడీపీకి గట్టి దెబ్బ తగిలినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సుబ్రమణ్యం తదుపరి చర్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సీనియర్ నేత రాజీనామా చేయడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఆధిపత్య పోరా లేక నియోజకవర్గంలో సుబ్రమణ్యం మాట చెల్లుబాటు కావడం లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.