సోషల్ మీడియాలో ఓ చిన్న లైక్ పెద్ద వివాదంగా మారింది. బాలీవుడ్ నటి (Bollywood Actress) అవ్నీత్ కౌర్ (Avneet Kaur) ఫ్యాన్ (Fan) పేజీలోని ఓ పోస్ట్ (Post)ను క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) లైక్ (Like) చేయడంతో ఆ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ అంశంపై బాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) స్పందిస్తూ, సమాజంలో మనకు ఇంత ఖాళీ సమయం ఉందా అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అనవసరమైన విషయాలను ఎందుకు ఇంతలా వైరల్ చేస్తారని ఆమె ప్రశ్నించారు. అవసరం లేని అంశాలకు ఎక్కువ సమయం వెచ్చించడం సరైనది కాదని సూచించారు.
విరాట్ కోహ్లీ అవ్నీత్ కౌర్ ఫ్యాన్ పేజీలోని ఓ ఫోటోను లైక్ చేయడంపై రకుల్ ఇలా అన్నారు: “ఈ విషయం నన్ను చాలా కలిచివేసింది. మనం అంతా ఇంత ఖాళీగా ఉన్నామా? విరాట్ లైక్ చేశాడన్న ఒకే కారణంతో అవ్నీత్ (Avneet) కు కొన్ని గంటల్లో 20 లక్షల మంది ఫాలోవర్లు పెరిగారు. అది పొరపాటున జరిగిన లైక్ అని ఆయన వివరించినప్పటికీ, పెద్ద సంఖ్యలో ఆమెను ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్ (Instagram)లో కొన్నిసార్లు మనం స్నేహితులను అనుకోకుండా అన్ఫాలో చేసినట్లే, ఇలాంటివి సాధారణంగా జరుగుతాయి. విరాట్ కూడా ఈ విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. కానీ, ఆయన సెలబ్రిటీ కాబట్టి ఆయన చేసే చిన్న చిన్న చర్యలు కూడా వార్తలుగా మారుతున్నాయి. వ్యక్తిగత విషయాలను ఇలా వైరల్ చేయడం నిజంగా బాధాకరం. సోషల్ మీడియాలో చాలామంది తమ సమయాన్ని వృథా చేస్తున్నారు.”
ఈ అంశంపై విరాట్ కోహ్లీ కూడా స్పష్టత ఇచ్చారు. తన ఇన్స్టాగ్రామ్ ఫీడ్ను క్లియర్ చేస్తున్నప్పుడు పొరపాటున లైక్ బటన్ నొక్కి ఉండవచ్చని, దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు. అనవసరమైన ప్రచారాలు చేయవద్దని కూడా ఆయన కోరారు.