ఐపీఎల్ రీషెడ్యూల్ పై క్లారిటీ..! మిగిలిన మ్యాచ్‌లు అప్పుడే?

ఐపీఎల్ రీషెడ్యూల్ పై క్లారిటీ..! మిగిలిన మ్యాచ్‌లు అప్పుడే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 18వ సీజన్ నిరవధికంగా వాయిదా పడిన (Postponed) విషయం తెలిసిందే. భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ (BCCI) అత్యవసరంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం, మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లు టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జరగనున్న టెస్టు సిరీస్ అనంతరం నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే దీనిపై బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. భారత క్రికెట్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయంపై త్వరలో స్పష్టత రానున్న‌ట్లుగా క్రికెట్ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

గురువారం రాత్రి పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌ను మ‌ధ్య‌లోనే ఆపేశారు. స‌రిహ‌ద్దులో ఉద్రిక్త‌త నేప‌థ్యంలో భారత సైన్యం అప్రమత్తమై, ధర్మశాలలో బ్లాక్ అవుట్‌ ప్రకటించింది. భద్రతా కారణాల చేత విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ఫ్లడ్ లైట్స్ పనిచేయలేదు. దీని వలన మ్యాచ్‌ను సగంలోనే ఆగిపోయింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల‌తో ఐపీఎల్ నిర‌వ‌ధిక వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment