విశాఖపట్నం (Visakhapatnam) లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విశాఖలోని ఓ మెడికల్ కాలేజీ (Medical College)లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థి (Student) ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డారు. కాలేజీ భవనం పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి విజయవాడకు చెందిన శ్రీరామ్ ప్రణీత్ (Sriram Praneeth) గా గురించారు. ఘటన విద్యార్థుల్లో తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. శ్రీరామ్ మృతికి కాలేజీలోని వైస్ ప్రిన్సిపల్ (Vice Principal) వేధింపులే (Harassment) కారణమని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శ్రీరామ్ మృతదేహాన్ని పరిశీలించి.. కాలేజీ మార్చురీ (College Mortuary) లోనే ఉంచారు. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, ఈ విషయంపై అధికారికంగా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
విశాఖలో వైస్ ప్రిన్సిపల్ వేధింపులకు మెడికో విద్యార్థి ఆత్మహత్య?
