రాజమండ్రి (Rajahmundry) లోని ఫార్మసీ (Pharmacy) విద్యార్థిని నాగాంజలి (Naganjali) కన్నుమూసింది (Passed Away). గత 12 రోజులుగా బొల్లినేని ఆసుపత్రి (Bollineni Hospital) లో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడిన ఆమె, చివరకు శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. మార్చి 28 నుంచి ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని వైద్యులు చెబుతున్నారు. నాగాంజలి మృతితో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఉదయం పోస్టుమార్టం కోసం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ విషాద ఘటనపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఘటనపై కీలక అనుమానాలు
లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన నాగాంజలి కేసు దర్యాప్తు సరైన దిశగా సాగడం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాగాంజలిని లైంగిక వేధింపులకు గురిచేసిన నిందితుడు టీడీపీ (TDP) ఎమ్మెల్యే బావమరిది దువ్వాడ మాధవరావు దీపక్ (Duvvada Madhav Rao Deepak) అని, ఆయన టీడీపీలో క్రియాశీల నేతగా వ్యవహరిస్తున్న కారణంగా, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు విద్యార్థి సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి.
సూసైడ్ నోట్తో బయటపడ్డ నిజాలు
నాగాంజలి తన డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్ ద్వారా ఆత్మహత్యాయత్నం బహిర్గతమైంది. దీపక్ను కఠినంగా శిక్షించాలంటూ బాధితురాలి కుటుంబం డిమాండ్ చేస్తోంది. అయితే, దీనిపై కూటమి ప్రభుత్వం మౌనం పాటించడంతో మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. మహిళా హోంమంత్రి (Women Home Minister) కూడా పరామర్శించకపోవడం, ‘‘ఆడపిల్లలపై చేయి వేస్తే తాట తీస్తా’’ అని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ ఘటనపై నోరు మెదపకపోవడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఆగ్రహంతో విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital) వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
నిందితుడికి టీడీపీ నేతలతో సంబంధాలు
కేసులో ప్రధాన నిందితుడైన కిమ్స్ ఆసుపత్రి ఏజీఎం దీపక్, కాకినాడ జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేకు మరిది కావడంతో, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, మరో టీడీపీ కీలక నేతకు అల్లుడైన దీపక్, గత ఎన్నికల్లో టీడీపీ తరఫున చురుగ్గా పనిచేశాడు. ఈ కారణంగా ప్రభుత్వం ఈ కేసుపై మౌనం పాటిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.