‘రాస్కో సాంబ‌’.. లోకేశ్ పీఏ తిరుమ‌ల ద‌ర్శ‌నాల దందా

రాస్కో సాంబ‌.. లోకేశ్ పీఏ తిరుమ‌ల ద‌ర్శ‌నాల దందా

తిరుమల (Tirumala) బ్రేక్‌ దర్శనాల లెట‌ర్ల జారీలో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు (CM Chandrababu) త‌న‌యుడు మంత్రి నారా లోకేష్‌ (Nara Lokesh) వ్యక్తిగత సహాయకుడు (పీఏ) సాంబశివరావు (Sambasiva Rao) వీఐపీ (VIP) దర్శనాల సిఫార్సు లేఖల (Darshan Recommendation Letters) దందా (Scam) న‌డుపుతున్నాడ‌ని, ఇందుకు సంబంధించి ఆధారాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. దీనిపై ప్ర‌తిప‌క్ష వైసీపీ (YCP) కూడా ట్వీట్ చేసింది. సీఎం కార్యాలయం (CM’s office) తో ఎలాంటి సంబంధం లేకపోయినా సాంబ‌శివ‌రావు “పీఎస్‌ టూ సీఎంవో (PS to CMO)”గా లేఖలు పంపించ‌డం వివాదాస్ప‌దంగా మారింది.

రోజుకు 12కుపైగా సిఫార్సుల ద్వారా వీఐపీ దర్శనాలను కేటాయిస్తూ, సామాన్య భక్తుల దర్శనానికి ఆటంకం కలిగిస్తున్నారని భ‌క్తులు మండిప‌డుతున్నారు. అధికారికంగా మంత్రుల సిఫార్సు లేఖ‌ల‌తో రోజుకు కేవలం రెండు దర్శనాలు మాత్రమే అనుమతించాల్సి ఉండగా లోకేశ్ పీఏ సాంబ‌శివ‌రావు 12కు పైగా లేఖ‌లు పంపిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంఖ్య భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. రోజుకు గ‌తంలో 4 వేల‌లోపే ఉండే వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఆ సంఖ్య 7 వేల‌కు చేరింది.

భక్తుల ఆగ్రహం
లోకేశ్ పీఏ సాంబ‌శివరావు మంగళగిరి (Mangalagiri) లో ఉండే వ్యక్తి. ఏపీ సీఎంవో పేషీతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ, తిరుమల జేఈవో కార్యాలయానికి “పీఎస్‌ టూ సీఎంవో” అని లేఖలు పంపిస్తూ దందా నడిపిస్తూ సొమ్ముచేసుకుంటున్నాడ‌ని ఆరోపణలు ఉన్నాయి. ఒకే వ్య‌క్తి పేరుతో రోజుకు ప‌దికి పైగా లేఖ‌లు వ‌స్తున్న‌ప్ప‌టికీ పాల‌క‌మండ‌లి ఎలాంటి అభ్యంత‌రం చెప్ప‌క‌పోవ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని హిందుత్వ సంఘాలు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment