ఆఫ్ఘనిస్తాన్తో (Afghanistan) జరగనున్న కీలక వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు (Team India) భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్స్ట్రింగ్ (Hamstring) గాయం (Injury) కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్లో కోహ్లీ అందుబాటులో లేకపోవడం భారత జట్టుకు పెద్ద లోటుగా మారింది. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తరఫున అద్భుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ, మ్యాచ్ చివరి దశలో గాయానికి గురైనట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్లో కోహ్లీ అద్భుత ఫామ్లో కనిపించాడు. 16 మ్యాచ్ల్లో 675 పరుగులు చేసి తన క్లాస్ను మరోసారి నిరూపించాడు. ఇదే జోరును అంతర్జాతీయ క్రికెట్లో (International Cricket) కొనసాగించి 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో కీలక పాత్ర పోషించాలని భావించిన కోహ్లీకి గాయం రూపంలో అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం అతని గాయం తీవ్రతపై వైద్య బృందం పర్యవేక్షణ కొనసాగుతుండగా, పూర్తి కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఇక భారత్-ఆఫ్ఘనిస్తాన్ (India – Afghanistan)సిరీస్ 2027 వన్డే ప్రపంచకప్కు తొలి అడుగుగా భావిస్తున్నారు. టెస్ట్, వన్డే జట్లకు యువ కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) నాయకత్వం వహించనున్నాడు. కోహ్లీ గైర్హాజరీతో అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. జూన్ 6న న్యూ చండీగఢ్లో (New Chandigarh) టెస్ట్ మ్యాచ్తో (Test Match) ఈ పర్యటన ప్రారంభం కానుండగా, అనంతరం ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా మూడు వన్డేలు జరగనున్నాయి. కోహ్లీ లేకుండా భారత్ ఎలా రాణిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.








