సిట్‌కు లేఖ రాసిన విజ‌య‌సాయిరెడ్డి

సిట్‌కు లేఖ రాసిన విజ‌య‌సాయిరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మద్యం కుంభకోణం (Liquor Scam) కేసుపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిపెట్టింది. కేసు విచార‌ణ‌ను త్వ‌ర‌గా తేల్చేందుకు సిట్ (SIT) ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇవాళ ఈ కేసులో విచారణకు రావాల్సిన‌ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) గైర్హాజరు (Absence) అయ్యారు. మ‌ద్యం కేసులో విజ‌య‌సాయిరెడ్డి పేరును కూడా చేర్చింది. కాగా, ఇవాళ సిట్ ముందుకు రావాల్సిన మాజీ ఎంపీ వివిధ కారణాల వల్ల విచారణకు హాజరుకాలేకపోతున్నానని పేర్కొంటూ విచార‌ణాధికారుల‌కు లేఖ (Letter) రాశారు. అయితే, త్వరలోనే ఎప్పుడు విచారణకు హాజరయ్యేది వెల్లడిస్తానని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, ఇప్పుడు విజయసాయి గైర్హాజరు కావడంతో రాజకీయంగా ఈ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment