హోంవ‌ర్క్ రాయ‌లేద‌ని విద్యార్థుల‌పై చెప్పుతో దాడి

హోంవ‌ర్క్ రాయ‌లేద‌ని విద్యార్థుల‌పై చెప్పుతో దాడి

Summarize with AI

సత్యసాయి జిల్లా ధర్మవరం (Dharmavaram) లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జీనియస్ స్కూల్‌ (Genius School) లో పనిచేస్తున్న టీచర్ (Teacher) అనిత (Anitha) , హోం వర్క్ (Homework) రాయలేదన్న కారణంతో 2వ తరగతి విద్యార్థుల (Students) పై చెప్పు (Slipper)తో దాడి (Attack) చేసింది. చిన్నారుల ఫిర్యాదుతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టీచ‌ర్‌ చర్య విద్యార్థుల మనోస్థితిని దెబ్బతీసిందని వారి తల్లిదండ్రులు (Parents) ఆరోపిస్తున్నారు. సంఘటనపై ఆగ్రహంతో తల్లిదండ్రులు స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. విషయం పోలీసుల వరకు వెళ్లడంతో, వారి జోక్యంతో స్కూల్ యాజమాన్యం క్షమాపణ (Apology) చెప్పినట్లు సమాచారం. ఇలాంటి ప్రవర్తన విద్యారంగంలో నెగటివ్ ధోరణులకు దారితీస్తుందని, పిల్లల్లో భయాన్ని పెంచుతుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment