ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య జరగనున్న మ్యాచ్కు భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఎంఎస్ ధోనీ ఆడుతాడనే వార్తలతో అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. అయితే చివరి నిమిషంలో వచ్చిన సమాచారం ప్రకారం ధోనీ ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగడం లేదు. కాలు కండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో టీమ్ మేనేజ్మెంట్ అతనికి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ధోనీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది పెద్ద నిరాశగా మారింది.
ఇక జట్టు కాంబినేషన్ విషయానికి వస్తే సీఎస్కే ప్లేయింగ్ ఎలెవెన్లో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. గాయపడిన ఖలీల్ అహ్మద్ స్థానంలో ముకేష్ చౌదరి జట్టులోకి రానున్నాడు. అతనితో పాటు అన్షుల్ కాంబోజ్ కొత్త బంతిని పంచుకోనుండగా, గుర్జప్నీత్ సింగ్ కూడా బౌలింగ్ విభాగంలో కీలక పాత్ర పోషించనున్నాడు. నాథన్ ఎలిస్ గైర్హాజరీతో బౌలింగ్ కొంత బలహీనంగా కనిపిస్తున్నా, ఈ కొత్త కాంబినేషన్ హైదరాబాద్ పిచ్పై ఎలా రాణిస్తుందో ఆసక్తికరంగా మారింది. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ఓపెనింగ్ జోడీగా కొనసాగనుండటం విశేషం.








