రష్యా అధ్యక్షుడు (Russian President) వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మరోసారి భారత్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాదిలోనే రెండోసారి భారత్కు రానుండటంతో అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వచ్చే సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమ్మిట్కు (BRICS Summit) పుతిన్ హాజరవుతున్నట్లు క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉషకోవ్ వెల్లడించారు. భారత్ అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సదస్సులో బ్రిక్స్ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య, వ్యూహాత్మక సహకార అంశాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిస్థితులు (Global Political Situation) వేగంగా మారుతున్న వేళ ఈ సమావేశంపై ప్రపంచవ్యాప్తంగా భారీ ఆసక్తి వ్యక్తమవుతోంది.
ప్రత్యేకంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం(Russia-Ukraine War), పశ్చిమాసియా ఉద్రిక్తతలు (West Asia Tensions), గ్లోబల్ ఎకానమీ (Global Economy) వంటి కీలక అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే గత డిసెంబర్లో కూడా పుతిన్ భారత్లో(India) పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీతో (Narendra Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, ఇంధన, వాణిజ్య రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడిన నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ కొద్ది నెలల వ్యవధిలోనే పుతిన్ భారత్కు రావడం భారత్-రష్యా మైత్రికి (India-Russia Friendship) మరింత బలం చేకూర్చే పరిణామంగా భావిస్తున్నారు.









అన్నపై పరోక్ష కౌంటరా?.. మనోజ్ వ్యాఖ్యలపై చర్చ