సత్యసాయి బాబా (Sathya Sai Baba) శత జయంతి (Centenary) ఉత్సవాలు (Celebrations) ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో, ఈ వేడుకల్లో పాల్గొనడం తనకు అరుదైన అవకాశం అని తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ప్రేమతోనే మనుషులను గెలుచుకోవచ్చని, సేవలతో దేవునిలా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకోవచ్చని నిరూపించిన మహానుభావులలో సత్యసాయి బాబా ఒకరని ఆయన అన్నారు. బాబా ఆలోచనలు, బోధనలు ప్రతి ఒక్కరికి స్పూర్తిగా ఉండాలని తెలంగాణ సీఎం అన్నారు.
పుట్టపర్తి (Puttaparthi)లోని సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులను సత్యసాయి బాబా ట్రస్టు చేసి చూపిందని, ముఖ్యంగా పేదల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించడం ఒక విశేషమని పేర్కొన్నారు. అలాగే చివరిదశలో ఉన్న లక్షలాది పేదలకు ఉచిత వైద్యం అందించి బాబా నిజమైన మానవతా సేవ చూపారని అన్నారు. పాలమూరు వంటి వలస ప్రాంతాలకు, అనంతపురం జిల్లాకు, అలాగే తమిళనాడులోనూ తాగునీటి సమస్యలను పరిష్కరించడంలో బాబా సేవలు అపారమని గుర్తుచేశారు.
మానవ సేవే మాధవ సేవ అని బోధించడం మాత్రమే కాకుండా, సత్యసాయి బాబా జీవితంలో అమలు చేసి చూపారన్నారు. సమాజంలో విద్య, వైద్యం, తాగునీరు వంటి ప్రాథమిక సమస్యలను పరిష్కరించడం ద్వారా కోట్ల మంది జీవితాల్లో వెలుగునింపారని పేర్కొన్నారు. జీవితంలో లక్ష్యాలను చేరడంలో అవసరమైన ధైర్యం, నమ్మకం బాబా బోధనలు ప్రజలకు అందించాయని సీఎం అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో సత్యసాయి బాబా భక్తులు ఉన్నారని, వారు వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ బాబా బోధనలు నిలబెట్టుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. సమాజ నిర్మాణంలో సత్యసాయి బాబా చూపిన మార్గం ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు.








