బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటిస్తున్న జాంబీ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న రణవీర్ ఈసారి జాంబీ బ్యాక్డ్రాప్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు జై మెహతా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం దక్షిణాది నటి కళ్యాణి ప్రియదర్శన్ పేరును పరిశీలిస్తున్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ‘లోక’ చిత్రంలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్కు మంచి స్పందన రావడంతో ‘ప్రళయ్’లో కీలక మహిళా పాత్రకు ఆమెనే ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ప్రాజెక్ట్ ఖరారైతే కళ్యాణి ప్రియదర్శన్కు ఇది బాలీవుడ్లో భారీ అవకాశంగా మారనుంది. ఇప్పటికే దక్షిణాది చిత్రాల్లో తనదైన గుర్తింపు సంపాదించిన ఆమె, రణవీర్ సింగ్ వంటి స్టార్ హీరోతో జతకడితే కెరీర్కు మరో స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ వార్త వేగంగా వైరల్ అవుతుండగా, రణవీర్ అభిమానులతో పాటు కళ్యాణి అభిమానులు కూడా ఈ కాంబినేషన్ నిజమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడితే ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.








