ఇంటింటికీ రేష‌న్ బంద్‌.. ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం

ఇంటింటికీ రేష‌న్ బంద్‌.. ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం

Summarize with AI

కూట‌మి ప్ర‌భుత్వం (Coalition Government) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రేషన్ సరఫరా (Ration Distribution) విధానంలో పెను మార్పులు తెచ్చింది. ఇంటింటికీ రేష‌న్ స‌ర‌ఫ‌రాకు గుడ్ బై (Goodbye)చెబుతున్నామ‌ని, జూన్ 1వ తేదీ నుంచి మొబైల్ రేషన్ వ్యాన్‌ల ద్వారా డోర్ డెలివరీ (Door Delivery) సేవలను (Services) పూర్తిగా నిలిపివేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ప్రకటించారు. ఇకపై ప్రజలు రేషన్ షాపుల (Ration Shops) నుంచి మాత్రమే పీడీఎస్ రైస్ (PDS Rice) తీసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జ‌రిగిన‌ కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,260 రేషన్ డెలివరీ వాహనాలు నిలిపివేయబడనున్నాయి.

నిర్ణయం వెనుక కారణాలు
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రేషన్ వ్యాన్‌ల ద్వారా ఇంటింటికీ జరుగుతున్న సరఫరాలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), డిప్యూటీ సీఎం (Deputy CM)తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని ఆయన తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డోర్ డెలివరీ విధానంపై అవినీతి ఆరోప‌ణ‌ చేస్తూ, దాన్ని రద్దు చేసి మళ్లీ పాత పద్ధతిలో రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఎండీయూ ఆపరేటర్ల నిరసనలు
ఈ నిర్ణయంపై మొబైల్ డెలివరీ యూనిట్ (ఎండీయూ) ఆపరేటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద వర్గాలకు చెందిన ఆపరేటర్లు ఈ వ్యవస్థ ద్వారా ఉపాధి పొందుతున్నారు. వ్యాన్‌లు నిలిపివేస్తే తమ జీవనోపాధి దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి జాలి చూపకుండా నిర్ణయాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవస్థను తొలగించాలని నిర్ణయించిన ప్ర‌భుత్వం.. ఏడాది తర్వాత అవినీతి ఆరోపణలతో ఇంటింటికీ రేష‌న్ స‌రుకుల పంపిణీ నిర్ణ‌యాన్ని విజ‌య‌వంతంగా నిలిపివేసింద‌ని ప్ర‌తిప‌క్ష వైసీపీ విమ‌ర్శ‌లు చేస్తోంది.

ప్రజలపై ప్రభావం.. ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు
ఈ నిర్ణయంతో ప్రజలు మళ్లీ రేషన్ షాపుల వద్ద బారులు తీరవలసి వస్తుందని, గతంలో ఎదుర్కొన్న కష్టాలు తిరిగి ఎదురవుతాయనే వాద‌న‌లు ప్ర‌తిప‌క్షం నుంచి వినిపిస్తున్నాయి. రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని, ఈ నిర్ణయం పేదల జీవితాలను మరింత కష్టతరం చేస్తుందని సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 2.50 లక్షల వాలంటీర్లను తొలగించిన నేపథ్యంలో, ఇప్పుడు ఎండీయూ ఆపరేటర్లు, రేషన్ వాహనాలను కూడా తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకోవ‌డంపై ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. జ‌గ‌న్ (Jagan) ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కం కావ‌డంతో రాజ‌కీయ దురుద్దేశంతోనే ఈ ప‌థ‌కాన్ని తొల‌గించార‌నే ఆరోప‌ణ‌లు సైతం వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment