ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్

ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ 'హైడ్రా': కేటీఆర్

Summarize with AI

జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికల (By Elections)  నేపథ్యంలో బీఆర్‌ఎస్(BRS) నాయకుడు కేటీఆర్(KTR) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, అయితే పార్టీకి అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి మద్దతుగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఈ ఉప ఎన్నికను తన సొంత పోరాటంగా భావించి పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.

కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శల దాడి

కాంగ్రెస్ నాయకులు ‘హైడ్రా'(Hydra) పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారని, ఆ నిధులతో జూబ్లీహిల్స్‌లో ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ దొంగ ఓట్లను రాయించిందని, వాటిని తొలగించే బాధ్యత బీఆర్‌ఎస్ కార్యకర్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అక్టోబర్ చివరి వారంలో లేదా నవంబర్ మొదటి వారంలో ఈ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ప్రజలు మోసపోయారు.. కానీ హైదరాబాద్ ప్రజలు నమ్మలేదు

జిల్లాల్లో ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు మోసపోయారని, కానీ హైదరాబాద్ ప్రజలు మాత్రం వారిని నమ్మలేదని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ‘తులం బంగారం’ ఇచ్చేవాళ్లు కాదని, మెడలో పుస్తెలను కూడా గుంజుకెళ్లే వాళ్లని తీవ్రంగా విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తులం బంగారం కాదు కదా, ‘తులం ఇనుము’ కూడా ఇవ్వడని ఎద్దేవా చేశారు. బతుకమ్మ, దసరా పండుగల ముందు ప్రజల అవసరాలు తీర్చాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు ఓటు ఎందుకు వేయాలి?

గతంలో మైనారిటీ నాయకుడు అజారుద్దీన్‌కు సీటు ఇచ్చి, ఇప్పుడు ధనవంతులకు ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీలకు టికెట్ ఇవ్వనప్పుడు వారు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలని ఆయన ప్రశ్నించారు. ఓటుకు డబ్బులు ఇస్తే తీసుకోవాలని, కానీ ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కే వేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment