26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం – మంత్రి పొన్నం ప్ర‌క‌ట‌న‌

26 నుంచి రేషన్ కార్డుల జారీ ప్రారంభం - మంత్రి పొన్నం ప్ర‌క‌ట‌న‌

Summarize with AI

తెలంగాణ రాష్ట్రంలో 26వ తేదీ నుంచి హైదరాబాద్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. హైద‌రాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అలాగే, ఇదే రోజున ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల వివరాలు కూడా వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.

రేషన్ కార్డుల పంపిణీ.. కొత్త మార్గదర్శకాలు
మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మాట్లాడుతూ.. “రాజకీయాలకతీతంగా, ఇతర జిల్లాలకు ఆదర్శంగా రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాలు హైదరాబాద్‌లో నిర్వహిస్తాం” అని చెప్పారు. సొంత స్థలమున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడంపై ప్రాధాన్యతను పెంచారు. ఈ ప్రక్రియకు సంబంధించి 50 శాతం దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని, దాదాపు 10 వేల మంది అర్హులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

సాంకేతిక సవరణలు అవసరం
ఇందిరమ్మ ఇళ్లు కేటాయించే క్రమంలో దరఖాస్తు చేస్తున్నవారి అర్హత విషయంలో ప్రభుత్వం కొన్ని సాంకేతిక సవరణలు చేయాలని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి సూచించారు. ఎల్లో కలర్‌ ప్లేట్‌ టాక్సీ డ్రైవర్లను కూడా కారు ఓనర్లుగా గుర్తించడం ద్వారా పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. వికలాంగుల జాబితాలో తలసేమియా బాధితులు, కీమోథెరపీ తీసుకునే వారు, డయాలసిస్ పేషెంట్లను కూడా చేర్చాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment