యూరియా కోసం రైతుల ఆందోళన.. సొసైటీ అద్దాలు ధ్వంసం (Video)

యూరియా కోసం రైతుల ఆందోళన.. సొసైటీ అద్దాలు ధ్వంసం

Summarize with AI

తూర్పుగోదావరి (East Godavari) జిల్లా కోరుకొండ (Korukonda) సొసైటీ (Society) వద్ద శ‌నివారం తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు చోటుచేసుకున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న వేళ యూరియా (Urea) అందక రైతులు (Farmers) ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని కోరుకొండ, రాజానగరం, సీతానగరం, గోకవరం మండలాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం సొసైటీ కార్యాలయానికి తరలివచ్చారు.

యూరియా స్టాక్ చేరిందనే సమాచారం రావడంతో ఒకేసారి రైతులు గుమికూడడంతో తోపులాట జ‌రిగింది. ఈ హడావుడిలో సొసైటీ కార్యాలయ అద్దాలు (Windows) పగిలిపోయాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. తమ వ్య‌వ‌సాయ అవసరాలకు తగినంతగా యూరియా అందించడం లేదని అధికారులను రైతులు నిలదీశారు. దీంతో అక్కడ వాగ్వాదం నెలకొంది.

రైతులు యూరియా కోసం ఎడతెరిపి లేకుండా రోజులు తరబడి ఎదురుచూస్తున్నప్పటికీ, సరఫరా సరైన విధంగా జరగకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు అధికారులను డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment