మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

Summarize with AI

మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు, నేతలు హాజరయ్యారు. దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ సింగ్ 92 సంవత్సరాల వయసులో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

శుక్రవారం ఉద‌యం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్‌లోని నివాసానికి తీసుకువచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇతర ప్రముఖ నేతలు, కుటుంబ సభ్యులు, సహచరులు ఆయనకు నివాళులర్పించారు. అనంతరం, కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలోనూ ప్రత్యేకంగా ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో, సిక్కు సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించారు. మ‌న్మోహ‌న్ సింగ్ అంత్య‌క్రియ‌ల‌కు రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని, కేంద్ర‌మంత్రులు, కాంగ్రెస్ నేత‌లు ఖ‌ర్గే, రాహుల్‌, ప్రియాంక హాజ‌ర‌య్యారు.

మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని దేశ సేవకు అంకితమిచ్చారు. ఆర్బీఐ గవర్నర్‌గా, ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించి, పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ప్రధానిగా తన పదవీకాలంలో దేశ ఆర్థిక ప్రగతికి చిరస్థాయిగా గుర్తుండే మార్గదర్శకమైన నిర్ణయాలు తీసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment