రాజ్యాంగం (Constitution) ఆమోదం (Approval) పొంది 76 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థులతో (Students) అసెంబ్లీ తరహాలోనే మాక్ అసెంబ్లీ (Mock Assembly) నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరుగనుంది.
ఈ మాక్ అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ప్రక్రియలన్నీ అసలైన అసెంబ్లీలా సాగనున్నాయి. ముందుగా ప్రొటెం స్పీకర్ ఎన్నిక, అనంతరం స్పీకర్ (Speaker) ఎన్నిక, తరువాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తారు. విద్యార్థులు సభ్యుల్లా పాల్గొని చట్టసభ ఎలా పనిచేస్తుందో ప్రత్యక్షంగా అనుభవించేందుకు ఇది మంచి అవకాశం అని అధికారులు తెలిపారు.
రాజ్యాంగ విలువలు, పార్లమెంటరీ పద్ధతులు, చట్టసభ నిర్వహణ తీరు విద్యార్థులకు చేరువ కావడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, బిల్లులు ఎలా ప్రవేశపెడతారు వంటి అంశాలను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించడానికి ఈ ప్రత్యేక కార్యక్రమం ఉపయోగపడనుంది.
కార్యక్రమానికి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా హాజరవుతారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి, అసెంబ్లీ పనితీరును వివరిచేందుకు కూడా నాయకులు పాల్గొననున్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించే కార్యక్రమంగా ఇది నిలవనుంది.








