ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్ అనంతరం పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. ఐపీఎస్ సజ్జనార్ తన ట్వీట్లో “బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదించి, యువత జీవితాలను నాశనం చేస్తూ, వేలల్లో పంచుతూ సంఘ సేవ చేస్తున్నట్లు నటించే వ్యక్తులను మీరు ఫాలో అవుతారా? వీరి స్వార్థం వల్లే సమాజంపై బెట్టింగ్ తీవ్ర ప్రభావం చూపుతోంది” అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. అనంతరం హర్షసాయి పై కేసు నమోదు చేశారు.
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇటీవల బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ.. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ వారికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇటీవల ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆ తరువాత మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్పై నమోదు అయ్యింది. తాజాగా హర్షసాయిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్ల కారణంగా యువత తీవ్రంగా నష్టపోతున్న విషయం తెలిసిందే.