తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్లవారుజామున 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ఒక పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డవ్వడం స్థానిక దుకాణదారులను, భక్తులను షాక్కి గురిచేసింది.
అధికారుల అలెర్ట్
చిరుత సంచారంపై మెట్ల మార్గం వద్ద ఉన్న దుకాణదారులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు, టీటీడీ విజిలెన్స్కు సమాచారం అందించారు. అధికారులు వెంటనే రంగంలోకి దిగినా, చిరుత జాడ ఎక్కడా కనిపించలేదు. అయినప్పటికీ భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, టీటీడీ అధికారులు నడక మార్గంలో భక్తులను అలెర్ట్ చేస్తున్నారు.
12 ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం 2 గంటల వరకే నడక మార్గంలోకి అనుమతిస్తున్నారు. ఆ తర్వాత భక్తులు గుంపులుగా మాత్రమే వెళ్లాలని సూచనలు జారీ చేశారు. ఈ ఘటనతో తిరుమలకు వచ్చే భక్తులు, స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.