బంగ్లా పాఠ్య‌పుస్త‌కాల్లో ‘జాతిపిత’ చరిత్ర తొలగింపు

బంగ్లా పాఠ్య‌పుస్త‌కాల్లో 'జాతిపిత' చరిత్ర తొలగింపు

బంగ్లాదేశ్‌లో మహ్మద్ యూనస్ ప్రభుత్వం విద్యా రంగంలో సంచలన మార్పులు చేస్తోంది. దేశ స్వాతంత్ర్య పోరాటానికి కీలకంగా నిలిచిన జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మన్ చరిత్రను స్కూల్ పుస్తకాల నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్ జాతీయ పాఠ్య ప్రణాళిక మరియు పాఠ్యపుస్తక బోర్డు (NCTB) ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థుల కోసం 441 పాఠ్యపుస్తకాల్లో మార్పులు చేసింది.

భారతదేశ సహాయాన్ని తగ్గించే ప్రయత్నం
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలకంగా సహాయపడిన భారతదేశ పాత్రను తగ్గించే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. భారత సైన్యం పాకిస్తాన్ దళాలపై సాధించిన విజయం, భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, ముజిబుర్ రెహ్మన్ కలిసి ఉన్న ఫొటోలు పాఠ్యపుస్తకాల్లో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

స్వాతంత్ర్య ప్రకటనపై కొత్త వివాదం
జియావుర్ రెహ్మాన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ప్రస్తుతం BNP నాయకురాలు ఖలీదా జియా భర్త అయిన జియావుర్ రోల్‌ను పెద్దగా చూపించే ప్రయత్నం NCTB మార్పుల్లో కనిపిస్తోంది. 1971 మార్చి 26న షేక్ ముజిబుర్ రెహ్మన్ ప్రకటించిన స్వాతంత్ర్య ప్రకటనను BNP మేజర్ జియావుర్ సూచనల మేరకే విడుదల చేశారని కొత్త పాఠ్యాంశాల్లో పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment