సినీ నిర్మాత, కమెడియన్ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి తన ట్వీట్(Tweet)తో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారారు. సినిమాలతో పాటు రాజకీయాలపై కూడా తరచుగా స్పందించే బండ్ల గణేష్, తాజాగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి అనేది ఆయన మెన్షన్ చేయకపోయినా.. ఇండైరెక్ట్గా ఇది వారి గురించే అంటూ సోషల్ మీడియా(Social Media)లో కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో బండ్లన్న ట్వీట్ కాస్త వైరల్(Viral Tweet)గా మారింది.
లైలా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృథ్వీరాజ్ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశాడు. ఫృథ్వీ కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమైన ఏకంగా లైలా సినిమాపై ప్రభావం పడేలా మారింది. దీంతో చిత్రయూనిట్ దిగివచ్చి అతని వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ ఫృథ్వీ వ్యాఖ్యలను తప్పుబడుతూ ఓ ట్వీట్ చేశారు.
గెలుపోటములపై గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
అంతకు గంట ముందు “గెలిచిన వానికి ఓటమి తప్పదు.. ఓడిన వానికి గెలుపు తప్పదు. ఇది అనివార్యం” అంటూ గణేష్ చేసిన ట్వీట్ చేశారు. ఇది కాస్త రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించింది. తెలంగాణలో కేసీఆర్ (KCR), ఆంధ్రప్రదేశ్లో జగన్ (YS Jagan) ఓటమిపాలవ్వడం.. వారిని ఉద్దేశించే బండ్లన్న ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని, భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో జగన్, కేసీఆర్ ప్రభుత్వాలే ఏర్పడతాయనే చర్చ మొదలైంది.
గెలిచిన వానికి ఓటమి తప్పదు
— BANDLA GANESH. (@ganeshbandla) February 10, 2025
ఓడిన వానికి గెలువక తప్పదు
అనివార్యమైన ఇట్టి విషయమై శోకింప తగదు .
ఇప్పటికే బండ్ల గణేష్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ, ఇటువంటి ట్వీట్లు చేయడం పార్టీ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్కు గణేష్ భక్తుడని ఆయనే పలు సందర్భాల్లో ప్రకటించుకున్నారు. అటు కాంగ్రెస్, ఇటు జనసేనానికి దగ్గరగా ఉన్న వ్యక్తి ఇలా కామెంట్స్ చేయడంపై సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. దీంతో, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.