దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)పై భారీగా పడింది. ఈ కేసులో జైలుపాలైన ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో జైలుకు వెళ్లొచ్చిన నేతలు విజయం సాధిస్తే, ఢిల్లీలో మాత్రం సీన్ పూర్తిగా మారింది.
ఇవాళ విడుదలైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోవడం కన్నా, అగ్రనేతల ఓటమి మరింత కఠినంగా మారింది. ఈ స్కామ్ కారణంగా ప్రజల మద్దతు తగ్గిందా? లేక ప్రత్యర్థుల వ్యూహాలు విజయవంతమయ్యాయా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నారు.
బీజేపీ ఘన విజయం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ 36 స్థానాల మేజిక్ ఫిగర్ను దాటేసింది. మరో 11 చోట్ల లీడింగ్లో కొనసాగుతోంది. దీంతో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. అటు ఆప్ 19 స్థానాల్లో గెలిచి 4 చోట్ల ఆధిక్యంలో ఉంది.