నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌..

నేడు వైఎస్ జ‌గ‌న్ కీల‌క‌ ప్రెస్‌మీట్‌..

వైసీపీ అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) నేడు మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో 11 గంట‌ల‌కు ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడ‌నున్నారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, పరిస్థితులతో పాటు, ప్రజా సంబంధ అంశాలపై జగన్‌ మీడియా (YS Jagan Press Meet)తో మాట్లాడతారని ఆ పార్టీ కేంద్ర కార్యాల‌యం ప్ర‌క‌టించింది. దీంతో జ‌గ‌న్ ప్రెస్‌మీట్‌పై విప‌రీత‌మైన క్రేజ్ నెల‌కొంది. వైసీపీ(YCP) శ్రేణులు త‌మ అధినేత మీడియా స‌మావేశం కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. కొన్ని మిన‌హా మెయిన్ స్ట్రీమ్ మీడియా, యూట్యూబ్‌ ఛాన‌ళ్లు వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్ లైవ్ షెడ్యూల్ ఫిక్స్ చేసుకొని రెడీగా ఉన్నాయి.

సోష‌ల్ మీడియాలో YS Jagan 2.0 ట్రెండింగ్‌
విజ‌య‌వాడ కార్పొరేట‌ర్లు, ముఖ్య నేత‌ల‌తో నిన్న జ‌రిగిన స‌మావేశంలో జ‌గ‌న్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియా (Social Media)లో ట్రెండ్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు వాట్స‌ప్ స్టేట‌స్‌ల‌లో, ఇన్‌స్టా స్టోరీల్లో జ‌గ‌న్ 2.0 వేరే లెవెల్ వీడియోస్ ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కార్య‌క‌ర్త‌ల‌కు భ‌రోసా ఇస్తూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్య‌లు క్యాడ‌ర్‌లో నూత‌న ఉత్తేజాన్ని నింపింద‌ని ఆ పార్టీ నాయ‌క‌త్వం భావిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment