రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానంటూ సంచలన ప్రకటన తరువాత శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి.. తన రాజీనామా అనంతరం తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రిపబ్లిక్ డే పరేడ్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఏటికొప్పాక బొమ్మల శకటం గురించి విజయసాయిరెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రదర్శించిన ఏపీ శకటాన్ని ప్రశంసిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెటిజన్లలో ఆసక్తి కలిగించింది. ఈ ట్వీట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తూ చర్చ మొదలుపెట్టారు.
Andhra Pradesh’s Republic Day tableau beautifully showcased the ancient art of Etikoppaka Toys – a perfect blend of tradition, craftsmanship, and sustainability. pic.twitter.com/fnV1v4tPue
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 27, 2025