ఆంధ్రప్రదేశ్లో 14,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వచ్చిన ఇండీచిప్ సెమికండక్టర్స్ వ్యవహారం ప్రస్తుతం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ కంపెనీపై అనేక అనుమానాలు మరియు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కంపెనీ పుట్టకముందే మంత్రులతో భేటీ జరగటం, తర్వాత అతి తక్కువ మూలధనంతో సంస్థ ప్రారంభం కావడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి.
మొదట, ఇండీచిప్ సెమికండక్టర్స్ లిమిటెడ్ 2025 జనవరి 2న కేవలం కోటి రూపాయల అధీకృత మూలధనంతో కన్పూర్ ఆర్ఓసి వద్ద నమోదు అయింది. కానీ, కంపెనీ నమోదు కాకముందే, 2024 డిసెంబర్ 21న కంపెనీ ప్రతినిధులు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పరిశ్రమల శాఖ మంత్రి టి జీ భరత్ను కలిశారు. జపాన్కు చెందిన ఇటోయ మైక్రో టెక్నాలజీ భాగస్వామ్యంతో ఏకంగా 14 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టానికి లోకేష్, టి జీ భరత్ల సమక్షంలో అవగాహనా ఒప్పందం చేసుకున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
కంపెనీ పుట్టకముందే మంత్రులతో భేటీ జరగటం, తర్వాత అతి తక్కువ మూలధనంతో సంస్థ ప్రారంభం కావడం వంటి అంశాలు వివాదాస్పదంగా మారాయి. అంతేకాక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను స్వాగతిస్తూ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించడం, కంపెనీ సామర్థ్యాలపై అనేక సందేహాలకు తావు కల్పిస్తోంది.
ప్రభుత్వ ప్రకటన ప్రకారం, ఈ యూనిట్ ద్వారా నెలకు 10,000 వేఫర్లు తయారు చేయడం మొదలవుతుంది. రెండు లేదా మూడు సంవత్సరాల్లో ఈ సంఖ్య 50,000 వేఫర్లకు పెరుగుతుందని తెలిపారు. ఈ యూనిట్ ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో 130 ఎకరాల్లో ఏర్పాటు చేయబోతున్నారు.
- ఉత్పన్నమవుతోన్న ప్రశ్నలు..
- నెల రోజుల అనుభవం కూడా లేని కంపెనీ ఇలా పెద్ద పెట్టుబడి ప్రకటించడం వెనుక దాగిన అజెండా ఏమిటి?
- జపాన్ కంపెనీకి అనుభవం ఉన్నప్పటికీ, భారతీయ భాగస్వామ్య కంపెనీకి అనుభవం ఉందా?
- కంపెనీ ఏర్పాటుకు ముందే మంత్రులు లోకేశ్, భరత్లతో భేటీ జరపడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి?
- ఇది నిజంగానే భారీ పెట్టుబడి ప్రాజెక్టా, లేదా ఈ గోల్ మాల్ వెనుక మరింత పెద్ద కథ ఉందా అనే విషయంపై ప్రజలు, పరిశ్రమ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.