హైదరాబాద్‌లో మెగా ఐటీ పార్క్.. ముందుకొచ్చిన సింగ‌పూర్ కంపెనీ

హైదరాబాద్‌లో మెగా ఐటీ పార్క్

సింగపూర్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ హైదరాబాద్‌లో అత్యాధునిక ఐటీ పార్క్‌ను నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ.450 కోట్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. ఇది సుమారు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబడనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మరియు పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు బృందంతో క్యాపిటాల్యాండ్ ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఈ ఐటీ పార్క్ ఏర్పాటుతో రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా, తెలంగాణ ఆర్థిక రంగానికి కూడా బలపడనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment