సూపర్స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి వచ్చిన తాజా వార్తలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారాయి. బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమాలో నటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
హైదరాబాద్లో ప్రియాంక..
ఇటీవల ప్రియాంక చోప్రా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించడంతో, ఈ వార్తలు మరింత బలపడ్డాయి. “ప్రియాంక, మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్కు వచ్చిందని” అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
మహేశ్-రాజమౌళి ప్రాజెక్ట్: ఏంటీ ప్రత్యేకం?
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్-వరల్డ్ ప్రాజెక్ట్గా ఉండబోతోంది. అద్భుతమైన కథతో, భారీ బడ్జెట్లో రూపొందుతున్న ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమా స్థాయిని మరింత పెంచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.