బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. గత ఏడాది జరిగిన అల్లర్ల కారణంగా షేక్ హసీనా భారత్కు వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఇప్పుడు, హసీనా పాస్పోర్టును రద్దు చేయాలని బంగ్లాదేశ్ భారత్ను కోరింది.
బంగ్లాదేశ్-భారత్ రాజకీయ ఉద్రిక్తతలు
గత ఏడాది జూలై-ఆగస్టు మధ్య బంగ్లాదేశ్లో తీవ్రమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అప్పుడు హసీనా ప్రభుత్వం కూలిపోవడంతో ఆమె బంగ్లా నుంచి పారిపోయి వచ్చి భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెను తిరిగి అప్పగించాలనే అభ్యర్థనతో భారత్ను సంప్రదించింది. కానీ, భారత్ అందుకు అంగీకరించలేదు. ఇటీవల హసీనా వీసాను భారత్ పొడిగించినట్లు వార్తలు రావడంతో అప్రమత్తమైన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. వెంటనే షేక్ హసీనాను అప్పగించాలని భారత్ను అభ్యర్థించింది.
గతంలో బంగ్లాదేశ్ 96 పాస్పోర్టులను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఇందులో 75 మంది జూలై నెలలో జరిగిన అల్లర్లతో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. హసీనాతో పాటు మరో 11 మందిపై అరెస్ట్ వారెంట్ జారీచేసింది. ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశ్ దౌత్య కార్యాలయాలకు నోటీసులు పంపినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి మహ్మద్ రఫీకుల్ ఆలం తెలిపారు. హసీనాను అప్పగించాలన్న బంగ్లాదేశ్ అభ్యర్థనకు భారత్ ఏ విధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.