శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సంతాపం తెలియ‌జేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment