తాగునీటి వాటాలపై కుద‌ర‌ని ఏకాభిప్రాయం

తాగునీటి వాటాలపై కుద‌ర‌ని ఏకాభిప్రాయం

Summarize with AI

కృష్ణా జలాల యాజమాన్య బోర్డు (KRMB) పరిధిలో తాగునీటి అవసరాలపై ఏపీ(AP), తెలంగాణ(Telangana) మధ్య జరిగిన కీలక సమావేశం ముగిసింది. తాగునీటి కోసం కృష్ణా జలాల(Krishna Water) వాటాల కేటాయింపుపై(Allocation of Water Shares) రెండు రాష్ట్రాలు భిన్నమైన వాదనలు వినిపించాయి. ప్రస్తుతం కేఆర్ఎంబీ పరిధిలో సుమారు 142 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

50:50 వాటా కోరిన తెలంగాణ
తాగునీటి అవసరాల కోసం కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ కోరినట్లు ఆ రాష్ట్ర ఈఎన్సీ తెలిపారు. ఏపీ మాత్రం 66:34 శాతం నిష్పత్తిలో నీటి వాటాలు కేటాయించాలని డిమాండ్‌ చేస్తోందని పేర్కొన్నారు. ఏపీ ప్రతిపాదనను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. ఇప్పటికే ఏపీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌(Pothireddypadu Head Regulator) ద్వారా కృష్ణా జలాలను తరలిస్తోందని తెలంగాణ అధికారులు సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సమానంగా పంచాలని తెలంగాణ తన వాదనను వినిపించింది.

అసంతృప్తిగా ముగిసిన త్రిసభ్య కమిటీ భేటీ
మరోవైపు త్రిసభ్య కమిటీ సమావేశం (Three-Member Committee) అసంతృప్తికరంగా ముగిసిందని ఏపీ ఈఎన్సీ (AP ENC)తెలిపారు. నాగార్జునసాగర్‌లో తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ డిమాండ్ చేసింది. తాగునీటి అవసరాల కోసం 66:34 నిష్పత్తిలో నీటిని కేటాయించాలని కోరింది. అదేవిధంగా ఏపీ తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని 97 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కేఆర్ఎంబీని ఏపీ కోరింది. రెండు రాష్ట్రాల వాదనలు, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, తాగునీటి అవసరాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు అధికారులు తెలిపారు.

ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తదుపరి చర్యలు, నీటి విడుదలపై కేఆర్ఎంబీ నిర్ణయం కీలకంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment