తిరుమ‌ల కొండ‌పై దేవ‌ర బ్యూటీ సంద‌డి

తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకున్న దేవ‌ర బ్యూటీ

తిరుమ‌ల కొండ‌పై దేవ‌ర బ్యూటీ సంద‌డి చేశారు. ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో త‌న స‌న్నిహితుల‌తో క‌లిసి శ్రీ‌వారిని ద‌ర్శించుకొని ప్ర‌త్యేక పూజ‌ల్లో పాల్గొన్నారు. వైకుంఠం వద్ద టీటీడీ అధికారులు ఆమెకు ప్రత్యేక స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం ఆలయ అధికారులు జాన్వీకి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమ‌ల కొండ‌పై శ్రీ‌వారి ద‌ర్శ‌నం అనంత‌రం జాన్వీక‌పూర్‌తో ప‌లువురు సెల్ఫీలు, ఫొటోలు దిగారు. జాన్వీ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం కొత్తేమీ కాదు. కాలిన‌డ‌క‌న కూడా ఆమె తిరుమ‌ల కొండ‌పై చేరుకొని స్వామివారిని ద‌ర్శించుకున్న సంద‌ర్భాలు కూడా ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment