SRH విధ్వంసం.. 242 పరుగులతో ఢిల్లీని చిత్తు చేసిన హైదరాబాద్!

SRH విధ్వంసం.. 242 పరుగులతో ఢిల్లీని చిత్తు చేసిన హైదరాబాద్!

ఉప్పల్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి దుమ్మురేపింది. టాస్‌ కోల్పోయి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్లకు 242 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అభిషేక్‌ శర్మ అద్భుత శతకంతో (135 నాటౌట్‌) మ్యాచ్‌ను పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడు. హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా వేగంగా 37 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ కొంత పోరాడినా 195/9కే పరిమితమైంది. ఇషాన్‌ మలింగ నాలుగు కీలక వికెట్లతో ఢిల్లీని దెబ్బతీయగా, హర్ష్‌ దూబే చివరి ఓవర్‌లో మూడు వికెట్లు తీసి మ్యాచ్‌ను ముగించాడు.

ఈ విజయంతో సన్‌రైజర్స్‌ వరుసగా మూడో గెలుపు సాధించి సీజన్‌లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. మ్యాచ్‌ అనంతరం కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ జట్టు ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అభిషేక్‌ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా ప్రశంసించాడు. “ఈ విజయానికి మొత్తం క్రెడిట్‌ అభిషేక్‌దే. ఇలాంటి పిచ్‌పై 200కి పైగా స్కోరు చేయడం గొప్ప విషయం” అని ఆయన అన్నారు. అలాగే కీలక ఓవర్లలో సరైన బౌలర్లను వినియోగించుకోవడమే విజయ రహస్యమని పేర్కొన్నారు. సన్‌రైజర్స్‌ దూకుడుతో ఈ సీజన్‌లో మరింత బలంగా మారుతోందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment