హైదరాబాద్ టీఎన్జీవో కాలనీలో అగ్ని భీభత్సం.. 15 బైక్‌లు దగ్ధం

హైదరాబాద్ టీఎన్జీవో కాలనీలో అగ్ని భీభత్సం.. 15 బైక్‌లు దగ్ధం

హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీవో కాలనీలో సోమవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక అపార్ట్‌మెంట్ సెల్లార్‌లోని ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సెల్లార్‌లో నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలకు మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగ అపార్ట్‌మెంట్ మొత్తాన్ని కమ్మేసింది. పై అంతస్తుల్లో ఉన్న నివాసితులు ఊపిరాడక ఇబ్బంది పడగా, కొన్ని నిమిషాల్లోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న వెంటనే గచ్చిబౌలి ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న వారిని నిచ్చెనల సాయంతో సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సుమారు 15 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమవగా, పొగ పీల్చడం వల్ల ఇద్దరు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment