ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2026 సీజన్ ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. నేడు బెంగళూరులోని (Bengaluru) చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ(RCB) – లక్నో (LSG) జట్లు 23వ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని సాధించాలని ఇరు జట్లు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కెప్టెన్ రజత్ పటీదార్ (Rajat Patidar) నాయకత్వంలో ఆర్సీబీ జట్టు మంచి ఫామ్లో ఉంది. అయితే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఆడతాడా లేదా అన్నది సస్పెన్స్గా మారింది. గత మ్యాచ్లో గాయం కావడంతో కోహ్లీ పూర్తిగా ఫిట్గా ఉన్నాడా అన్నది మ్యాచ్ సమయానికి తెలుస్తుంది. బ్యాటింగ్, బౌలింగ్లో బలంగా ఉన్న ఆర్సీబీ సొంత మైదానం ప్రయోజనంతో ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది.
లక్నో జట్టు ఈ సీజన్లో మిశ్రమ ఫలితాలు సాధించినప్పటికీ, రిషభ్ పంత్ (Rishabh Pant), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని వంటి ఆటగాళ్లు మ్యాచ్ను తిప్పేయగల సామర్థ్యం కలిగినవారు. బౌలింగ్లో మయాంక్ యాదవ్ వేగం, రవి బిష్ణోయ్ స్పిన్ జట్టుకు బలం.
చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium) పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఆధిపత్యం చూపుతుందా? లేక లక్నో షాక్ ఇస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.








