పశ్చిమాసియాలో (West Asia) యుద్ధం (War) తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil), సహజ వాయువు (Natural Gas) సరఫరాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ (Strait of Hormuz) మార్గంలో రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఎగసిపడుతున్నాయి. ఈ సంక్షోభ సమయంలో రష్యా భారత్కు కీలక భరోసా ఇచ్చింది. రష్యా డిప్యూటీ ప్రధాని డెనిస్ మాంటురోవ్ (Denis Manturov) న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ (Narendra Modi), ఎస్. జైశంకర్ (S. Jaishankar), నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman), అజిత్ డోవల్ తో సమావేశమై చమురు, గ్యాస్ సరఫరాను పెంచేందుకు సిద్ధమని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్లో అనిశ్చితి పెరిగిన ఈ సమయంలో భారత్కు నిరంతర సరఫరా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, అమెరికా-ఇజ్రాయెల్ (United States-Israel) మరియు ఇరాన్(Iran) మధ్య యుద్ధం ప్రభావంతో భారత్ మళ్లీ రష్యా నుంచి చమురు దిగుమతులను వేగంగా పెంచుతోంది. గతంలో కొంత తగ్గిన దిగుమతులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అంతేకాక, రష్యా భారత్కు ఎరువుల సరఫరాను పెంచుతూ రైతులకు మద్దతుగా నిలుస్తోంది. వ్లాదిమిర్ పుతిన్ మరియు మోదీ లక్ష్యంగా పెట్టుకున్న 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం సాధించేందుకు ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అణుశక్తి రంగాల్లో సహకారం మరింత బలపడే దిశగా అడుగులు పడుతున్నాయి. మొత్తంగా, పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో భారత్కు రష్యా ఒక కీలక ఇంధన భాగస్వామిగా నిలుస్తోంది.









హద్దులు దాటిన మాటలు.. ప్రొఫెసర్పై బాడీ షేమింగ్