మేజర్ ధ్యానచంద్ ఖేల్రత్న అవార్డుల నామినీల జాబితాలో ప్రముఖ షూటర్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్ పేరు లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కమిటీ ఆమె పేరును రికమెండ్ చేయలేదని అధికారిక సమాచారం వెలువడింది. అయితే, ఈ వివాదం మరింత ముదరడంతో స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి వివరణ వచ్చింది. మను భాకర్ అవార్డుకు దరఖాస్తు చేసుకోలేదని పేర్కొన్నారు.
స్పోర్ట్స్ మినిస్ట్రీ నుంచి వచ్చిన ప్రకటనపై మను భాకర్ తండ్రి రామకృష్ణ స్పందించారు. దరఖాస్తు చేసుకోలేదన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నామని, అయినా అవార్డుల కోసం అడుక్కోవాల్సిన అవసరం వస్తే, క్రీడాకారులు సాధించిన మెడల్స్కు అర్థమేముంటుంది?” అని ఆయన ప్రశ్నించారు.
ఈ వివాదం నామినేషన్ ప్రక్రియలో పారదర్శకతపై అనేక సందేహాలను రేకెత్తిస్తోంది. క్రీడాకారులను గౌరవించే అవార్డుల వెనుక రాజకీయాలు లేకుండా చూడాలని అభిమానులు కోరుతున్నారు.